సాధారణంగా కరోనా తర్వాత సినిమా ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. రూ. కోట్లు పెడితేగానీ సినిమాలు పూర్తి కావడం లేదు. ఈ రోజుల్లో చిన్న సినిమాల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించాలన్న కోరికతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోజు రోజుకూ టెక్నాలజీని అంది పుచ్చుకుని రూ. వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు.
అయితే అతి తక్కువ బడ్జెట్ తో రూ. వేలల్లోనే సినిమా తీయొచ్చని చాలామంది ఊహించరు. కానీ కేవలం రూ. 33 వేలతో ఓ దర్శకుడు సినిమా తీసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. బాహుబలి మూవీ రేంజ్ లో విజువల్స్ ఉండటం గమనార్హం.
ఏఐ సాయంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రాహి అనిల్ భార్వి. ఈ సినిమా పేరు మన్- పిశాచ్.. గతంలో ఆయన మరాఠీ భాషలో ‘తుంబాడ్’ అనే సినిమా తీసి ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కేవలం రూ.33 వేలతో సినిమాని తీసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మరి ఈ మూవీని ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా తీశాడో ఆ విశేషాలను పంచుకున్నాడు.
దర్శకుడు అనిల్ భార్వి ఈ సినిమా కథను చాలా బ్రీఫ్ గా రాసుకున్నారు. ఆ కథను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సినిమాగా ఎలా చేయొచ్చు అనే ఒక గైడెన్స్ ను క్రియేట్ చేసుకున్నాడు. అలా కేవలం 60 పేజీల స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. మేకింగ్ విషయంలో కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయకుండా చేతి తోనే కొన్ని బొమ్మలను గీసి దానికి స్టొరీ బోర్డు రూపంలో ఏర్పాటు చేశాడు. అలా ఐ ఫోన్ తో తీసిన వీడియోలను, ఫోటోషాప్ ఏఐ ద్వారా జనరేట్ చేసినట్లు తెలిపాడు. అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ద్వారా కొన్ని విజువల్స్ ను వాడుకొని సినిమాను పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.

ఇక ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 80 కు పైగా ఉంది. మార్చి 18న యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి అదరగొడుతోంది.








